శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మనోహరుడు' సినిమాలో విక్రమ్ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమీజాక్సన్ ఓ గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది. పాటలను విభిన్నంగా తెరకెక్కించే శంకర్, ఈ సినిమాలోని ఓ పాట కోసం కొన్ని పాములను కూడా తెప్పించాడట. చిత్రీకరణలో కొన్ని చోట్ల హీరోయిన్ ఈ పాములను తాకాల్సి ఉంటుంది. దాంతో, అమీ జాక్సన్ ఈ సన్నివేశాలు చేయగలదో లేదోనని అంతా భయపడ్డారు. అయితే పాములను చూసిన అమీ మాత్రం అస్సలు భయపడకుండా వాటిని చక్కగా హ్యాండిల్ చేసేసిందట. దీంతో హీరో విక్రమ్ తోపాటు దర్శకుడు శంకర్ కూడా అవాక్కయ్యారు. కాగా ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమన్ అద్భుతమైన బాణీలిచ్చారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: