తెలుగు సినీమా రంగంలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు ఎంత ప్రముఖ వ్యక్తులో అందరికీ తెలిసిందే. సినిమా రంగంలోకి వ్యక్తులుగా ప్రవేశించి వ్యవస్థలుగా మారిన గొప్ప మనుషులు వారు. కాగా, తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ ఎన్ ఎ టి (నేషనల్ ఆర్ట్ ధియేటర్) బ్యానర్ పై తోడు దొంగలు అనే సినిమాను డి.యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నిర్మించారు. ఇందులో ముఖ్య పాత్రలలో ఎన్టీఆర్, గుమ్మడి వెంకటేశ్వరరావు కలసి నటించారు. అలాగే షూటింగ్ పూర్తి అయిన తరువాత సినిమా ప్రివ్యూ కి అక్కినేని ని ఆహ్వనించారు ఎన్టీఆర్. సినిమా చూసి ఎన్టీఆర్ అభినందిస్తూ సినిమా బాగ వచ్చిందని, అయితే ఈ తోడుదొంగలు టైటిల్ మన ఇద్దరికి బాగా సరిపోయేదని, మన ఇద్దరం కలిసి నటిస్తే సినిమా టైటిల్ కు ఇంకా న్యాయం జరిగేదని అక్కినేని చమత్కరించారు. అక్కడ ఉన్న వారంతా ఈ మాటలకు పైకి నవ్వులు చిందించినా.. లోపల మాత్రం ఈ మాటలు నిజమేనని అనుకుని ఉండి ఉంటారు. ఎందుకంటే సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని దొంగిలించడంలో వారిద్దరూ తోడుదొంగలు మరి..! కాదని మీరు అనగలరా..?

మరింత సమాచారం తెలుసుకోండి: