దేశముదురు సినిమా తరువాత పూరీ జగన్నాథ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇద్దరు అమ్మాయిలతో.. అనే సినిమా తెరకెక్కనుంది. ప్రసుత్తం కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాతో బిజీగా ఉన్న పూరీ జగన్నాథ్ ఆ సినిమా పూర్తయిన తరువాత ఈ ఇద్దరు అమ్మాయిలతో సినిమా పనిలో పడతాడు. కాగా, కథ ప్రకారం ఈ ఇద్దరు అమ్మాయిలతో సినిమా షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల్లో జరుగుతుంది. ఇందు కోసం చిత్ర యూనిట్ బార్సిలోనా నగరాన్ని ఎంచుకుంది. నవంబర్ నెలలో బార్సిలోనాలో ఇద్దరమ్మాయిలతో షూటింగ్ జరుగుతుందని, అక్కడి వివిధ లొకేషన్లలో, చిత్రంలోని ప్రధాన తారాగణంతో షూటింగ్ నిర్వహిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే, ఈ ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా అమలాపాల్, తాప్సీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: