రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం మరో మలుపు తిరిగింది. మిన్నీ మాథ్యూకాలం కాలం ఈనెల 31న ముగియనుండడంతో ఈ స్థానంలో మహంతిని నియమిస్తారని ప్రచారం జరిగింది. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మరో మూడు నెలల పాటు మిన్నీ మాథ్యూనే పదవిలో కొనసాగే విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూనే కొనసాగించే విషయాన్ని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి కూడా తెలియజేసినట్లుగా తెలుస్తుంది. నిజానికి ప్రస్థుతం కొనసాగుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మూడు నెలల పాటు కొనసాగించేందుకు రాష్ట్రప్రభుత్వానికి అవకాశం ఉంది. దీనిపై కేంద్రానికి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే తనకున్నటువంటి అవకాశం మేరకు మిన్నీ మాథ్యూను మూడునెలల పాటు కొనసాగే విధంగా పొడగించే అవకాశముంది. ఈవిషయంపై నేడో, రేపో ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: