విజయవాడ ఎంపీలగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకొచ్చి తెలంగాణ అంశంపై స్పందించారు. హైదరాబాద్ లో ఉంటున్న ఏ పార్టీ అధినేతకైనా సమైక్యవాదినని చెప్పే ధైర్యముందా అని ప్రశ్నించారు. రాఘవులు, ఓవైసీ మాత్రమే సమైక్యాంధ్రకు ధైర్యంగా మద్దతు తెలిపారని లగడపాటి ప్రశంసించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. మేం సైలెంట్ - వారు వయెలెన్స్.. సమైక్యవాదులు సైలెంట్ గా వ్యవహరిస్తుంటే వేర్పాటువాదులు వయెలెన్స్ చేస్తున్నారని లగడపాటి అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ లోక్ సభ స్థానాలకు పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమన్నారు. హైదరాబాద్ తెలుగు తల్లి సొత్తు అన్నారు. రాష్ట్రాన్ని విభజించే శక్తి ఎవరికీ లేదన్నారు. సమైక్యవాదుల శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: