ఆర్. నారాయణ మూర్తి ఓ కొత్త సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతీసారీ ఓ సామాజిక సమస్యపై తన సినీ బాణాన్ని ఎక్కుపెట్టే నారాయమూర్తి... ఈ సారి ఢిల్లీ అత్యాచార ఘటనను తన చిత్రానికి నేపథ్యంగా మార్చుకున్నారు. ‘విదేశీ సంస్కృతి మత్తులో యువతరం కూరుకుపోయింది. మన ఆచార సంప్రదాయాలకూ కట్టుబాట్లకూ ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేసింది. అందుకే, ఈసారి నా చిత్రం ద్వారా యువతకి ఓ సందేశం ఇద్దాం అనుకుంటున్నాను. మన సంస్క్రుతి గొప్పతనాన్ని యువతకి చెబుదామని భావిస్తున్నాను. భారతీయ వాతావరణం గురించి, భారతీయ మహిళలకు మనం ఇవ్వాల్సిన గౌరవం గురించి ఈ చిత్రం ఉండబోతోంది. ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఓ యువతిపై అత్యాచారం జరిగినప్పుడు యువత స్పందించిన తీరు నా కెంతో నచ్చింది. ఎంతోమంది బాధ్యతాయుతంగా ఆలోచించారు. ఆ ఆలోచన అందరిలోనూ రావాలన్నదే నా ఆకాంక్ష’ అని వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: