పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబుల్ సెంచరీ కొట్టాడు. ‘గబ్బర్ సింగ్' చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. పదేళ్లుగా హిట్ లేని పవర్ స్టార్ 'గబ్బర్ సింగ్'తో తన సక్సెస్ దాహం తీర్చుకున్నాడు. ఈ సినిమా ఐదు సెంటర్లలో రెండు వందల రోజులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గానే కాకుండా రికార్డు స్థాయి కలెక్షన్లు కురిపించింది. అయితే ఈ సినిమా రెండు వందల రోజుల విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 'గబ్బర్ సింగ్' నిర్మించిన పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేష్, దీనికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకోసం 'గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్' అనే టైటిల్ని రిజిస్టర్ చేశాడు. ఈ సీక్వల్ లోనూ నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం హిందీలో రూపొందుతున్న 'దబాంగ్ 2' చిత్రం ఆధారంగా 'గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్'ను రూపొందించబోతున్నారు. అయితే, ఈ సీక్వెల్ మూవీకి ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: